తెలుగులో ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న “క్రాక్” అనే చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ క్వీన్ శృతిహాసన్ నటిస్తుండగా తమిళ ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ని ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశాడు.
అయితే ఇందులో తెలుగులో ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ అంకిత మహారాణా అలియాస్ అప్సర రాణి స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు తెలిపాడు. అంతేగాక ఈ విషయానికి సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఒక స్టైల్ ని కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.
దీంతో మాస్ మహారాజా సినిమా అప్డేట్ తెలియడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఈ చిత్రం స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న అప్సర రాణి అందాల ఆరబోతకు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి బాగానే పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పనులు పూర్తయి విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు తాత్కాలికంగా నిలిపి వేయడంతో ఈ చిత్రం ఆలస్యంగా విడుదల అవుతోంది.దీంతో దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
మరి ఇ దసరా బరిలో మాస్ మహారాజా ఎలా మెప్పిస్తాడో చూడాలి.