తెలుగులో ప్రముఖ దర్శకుడు రాధా మోహన్ దర్శకత్వం వహించినటువంటి “గౌరవం” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే అల్లు శిరీష్ తన సినీ బ్యాక్ గ్రౌండ్ కుటుంభం నుంచి వచ్చినప్పటికీ సొంతంగా తన నటన టాలెంట్ తో అవకాశాలు దక్కించుకున్నాడు.
కానీ వాటిని సఫలీకృతం చేసుకునే విషయంలో కొంతమేర కొంత మేర అవగాహన లోపించడంతో సినిమా పరిశ్రమలో ఆశించిన స్థాయిలో హీరోగా రాణించలేక పోతున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో అల్లు శిరీష్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో హల చల్ చేస్తున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే సినీ పరిశ్రమకు రాక ముందు అల్లు శిరీష్ ఎంత బొద్దుగా ఉండేవాడో స్పష్టంగా కనిపిస్తోంది.అయితే సినిమాల్లోకి రాకముందు అల్లు శిరీష్ చాలా బరువు ఉండే వాడిని కానీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు పలు చిత్రాల ఆడిషన్లలో బరువు కారణంగా రిజెక్ట్ అవ్వడంతో వెంటనే బరువు తగ్గే పనిలో పడ్డాడట.
ఇందుకోసం సంవత్సర కాలంలోనే జిమ్ వర్కౌట్లు మరియు కఠిన ఆహారపు అలవాట్లు పాటిస్తూ దాదాపుగా సిక్స్ ప్యాక్ బాడీ లోకి మారిపోయాడు.దీన్ని బట్టి చూస్తే కష్టపడి పని చేస్తే కచ్చితంగా మెరుగైన ఫలితాలను పొందవచ్చని అల్లు శిరీష్ తన బరువు తగ్గే విషయంలో నిరూపించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా అల్లు శిరీష్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొత్త జంట, శ్రీరస్తూ శుభమస్తూ, తదితర చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఆ తరువాత నటించినటువంటి ఏబిసిడి, ఒక్కక్షణం తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంత మేర అల్లు శిరీష్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
.