తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎ.మల్లికార్జున్ దర్శకత్వం వహించిన “అభిమన్యు” అనే చిత్రంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన నటించిన “కన్నడ బ్యూటీ దివ్య స్పందన” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే దివ్య స్పందన వచ్చి రావడంతోనే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
కానీ తన మాతృ భాష అయినటువంటి కన్నడలో మాత్రం వరుస చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే మొదటగా దివ్య స్పందన ముంబైలో మోడలింగ్ కోర్స్ చదువుతూ అలాగే కొంత కాలం పాటు మోడలింగ్ రంగంలో పని చేసింది.
ఆ తర్వాత తనకు నటనపై దృష్టి మళ్లడంతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన “అభి” అనే చిత్రంలో నటించి నటిగా పరిచయమైంది.
కాగా స్పందన తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకులు.
దాంతో స్పందనకి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభించడంతో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా బాగానే రాణించింది.అంతేగాక కొంతకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కూడా వెలుగొందింది.
కానీ ఈ మధ్య కాలంలో కొంత మేర బరువు పెరగడంతో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేక పోతోంది.దీంతో ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.
వచ్చి రావడంతోనే కర్ణాటకలోని నియోజకవర్గమైన మాంద్య ఎంపీ టికెట్ ని దక్కించుకుని గెలుపొందింది.ఆ తర్వాత 2014 సంవత్సరంలో జరిగినటువంటి జనరల్ ఎన్నికలలో సి.ఎస్ పుట్టరాజు చేతిలో 5,500 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ తన సేవలను అందిస్తోంది.
అయితే రాజకీయాల్లో చేరిన తర్వాత దివ్య స్పందన తన సినీ కెరీర్ పై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది. దీంతో క్రమక్రమంగా సినిమాలకు దూరమై పోయింది.చివరగా కన్నడలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “నాగరహవు” అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళి ఇప్పటివరకు ఈ అమ్మడు ఎలాంటి చిత్రాలలో నటించలేదు.
ఇటీవలే దివ్య స్పందనకి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అవకాశం వచ్చినప్పటికీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో నటించలేనని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.