తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన “వెన్నెల” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “అమెరికన్ బ్యూటీ పార్వతి మెల్టన్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు అప్పట్లో తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
కానీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక తెర మరుగైంది.
అయితే పార్వతి మెల్టన్ హీరోయిన్ గానే కాకుండా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “దూకుడు” చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కానీ ఎందుకో సినిమా హీరోయిన్ అవకాశాలను మాత్రం దక్కించుకోలేక పోయింది.దీంతో తనకంటూ సినీ కెరీర్ లో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమించింది.
అయినప్పటికీ సినిమా అవకాశాలు రాక పోవడంతో చివరికి చేసేదేమీ లేక అమెరికాకి వెళ్ళిపోయింది. అయితే సినిమాల్లోకి రాక ముందు పార్వతి మెల్టన్ వైద్యశాస్త్రంలో ఎంబిబిఎస్ చదువుని పూర్తి చేసింది.
దీంతో ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తోంది.అలాగే తనతో పాటు డాక్టర్ గా పని చేస్తున్నటువంటి శంషు లలని డాక్టర్ ని పెళ్లాడింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో పార్వతీ మెల్టన్ చివరగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన “యమహో యమ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అలాగే “మురళి” అనే ఓ పాన్ ఇండియన్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది కానీ పలు అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.