ఈ విలన్ తెలుగు సినిమాలకి దర్శకత్వం కూడా వహించాడని మీకు తెలుసా...?

తెలుగులో సీనియర్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన “అంతఃపురం” అనే చిత్రం ద్వారా నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన “ప్రముఖ విలన్ జీవి సుధాకర్ నాయుడు” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే జీవి సుధాకర్ నాయుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహారాజా రవితేజ హీరోల చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

 Telugu Veteran Villain Gv Sudhakar Naidu Movie Career News, gv Sudhakar Naidu,-TeluguStop.com

అయితే సినిమాల్లో విలన్ గా నటిస్తున్న సమయంలో దర్శకత్వంపై దృష్టి మల్లడంతో దర్శకుడిగా మారాడు.

ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటించినటువంటి “హీరో” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.ఆ తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించినటువంటి “రంగా ది దొంగ” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.

  కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దాంతో ఇక అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి సినిమాలకి దర్శకత్వం వహించ లేదు.

ఆ తర్వాత 2014 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గాజువాక నియోజకవర్గంలో పోటీ చేశాడు. కానీ అనుకోకుండా ఓటమి పాలయ్యాడు.

 దాంతో పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ మధ్య కాలంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి “జనసేన పార్టీ”లో చేరి తన సేవలను అందించాడు.

అయితే ఈ మధ్య కాలంలో జీవి సుధాకర్ నాయుడు రాజకీయాల్లో బిజీ బిజీ గా ఉండటంతో కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు.

 ఈ విషయం ఇలా ఉండగా జీవి సుధాకర్ నాయుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో కలిపి 50 కి పైగా చిత్రాలలో విలన్ పాత్రలలో నటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube