తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహించిన “ఎవరైనా ఎప్పుడైనా” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “కోలీవుడ్ బ్యూటీ విమలా రామన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే విమలా రామన్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో వరుస అవకాశాలతో బాగానే రాణించినప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది.దీంతో కొంత కాలం పాటూ నాట్యం పై దృష్టి సారించింది.
ఈ క్రమంలో పలు నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
అయితే ఈ మధ్య కాలంలో విమలా రామన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
అంతేగాక అప్పుడప్పుడూ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా మద్యమం అయిన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అలరిస్తోంది.ఇటీవలే విమలా రామన్ ఓ ప్రముఖ ఫొటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని సంప్రదాయ దుస్తులను ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
దీంతో ఈ అమ్మడి అందానికి ఫిదా అయిన నెటిజన్లు 38 ఏళ్ళు దాటినా వన్నె తరగని అందంతో మెరిసి పోతుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ మధ్య కాలంలో విమలా రామన్ కొంతమేర గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.
అంతేగాక ప్రస్తుతం తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని, అందువల్లే సినిమా అవకాశాల కోసం కొంతమేర గ్లామర్ డోస్ పెంచిందని కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా విమలా రామన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కిపైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.
అయితే తెలుగులో చివరిగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “ఓం నమో వెంకటేశాయ” చిత్రంలో శ్రీదేవి పద్మావతి పాత్రలో కనిపించి అలరించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఈమె తెలుగు సినిమాలలో నటించలేదు.