తెలుగులో నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ రోజా సెల్వమణి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రోజా సెల్వమణి హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు ఆర్.
కె.సెల్వమణి ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వారి పేర్లు అన్షు మాలిక సెల్వమణి మరియు కృష్ణ లోహిత సెల్వమణి.
అయితే సినిమాల్లో కొంతమేర అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చింది.ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
కాగా తాజాగా రోజా సెల్వమణి తన కూతురు అన్షు మాలిక సెల్వమణి కి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను నెటిజన్లతో పంచుకుంది.
ఇందులో భాగంగా తన కూతురు చాలా సైలెంట్ గా ఉంటుందని, అంతేగాక బయటకి కూడా చాలా అరుదుగా వెళుతుంటుందని తెలిపింది.
ఇటీవలే ఓ ప్రముఖ ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఐదు మంది పిల్లలను చదివిస్తుందని ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అలాంటి ఆలోచన వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.అంతేగాక తన కూతురు అన్షు మాలికకు చదువు అంటే అమితమైన ఇష్టమని దాంతో ఎప్పుడూ నిరంతరం పుస్తకాలను చదువుతూనే ఉంటుందని కూడా తెలిపింది.
అయితే అతి పిన్న వయసులోనే అయిదుగురు పిల్లలని చదివించాలని మంచి ఆలోచన కలిగినటువంటి అన్షు మాలికను కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు.అంతేగాక తల్లికి తగ్గ కూతురని మరికొంతమంది రోజా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రోజా సెల్వమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా గడుపుతోంది. మరోపక్క తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు ఒకసారి జబర్దస్త్ కామెడీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.