తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.సముద్ర దర్శకత్వం వహించిన “సూర్యం” అనే చిత్రంలో మంచు హీరో మంచు విష్ణు సరసన ఆడిపాడి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ “సెలీనా జైట్లీ” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను బాగానే అలరించింది.
కానీ ఎందుకో తెలుగులో సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.
దీంతో బాలీవుడ్ కి వెళ్లి పోయి అక్కడ వరుసగా అరడజను సినిమాలలో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో అక్కడ కూడా పెద్దగా రాణించలేక పోయింది.కాగా తాజాగా సెలీనా జైట్లీ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ దుమారం రేపుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ అమ్మడు తెలుగులో “సూర్యం” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని చివరికి ఆ ప్రేమ విషయం కాస్త హీరో తండ్రికి తెలియడంతో వీరి ప్రేమ పెటాకులైందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.అంతేగాక ఆ హీరో తండ్రి ఇచ్చినటువంటి వార్నింగ్ కి భయపడి సెలీనా జైట్లీ టాలీవుడ్ సినిమా పరిశ్రమను పూర్తిగా వదిలి పెట్టి వెళ్లిపోయిందని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.
ఈ విషయం జరిగిన కొంతకాలం తర్వాత సెలీనా జైట్లీ “పీటర్ హాగ్” అనే వ్యక్తిని మళ్ళీ ప్రేమించి 2011 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయిన తర్వాత సెలీనా జైట్లీ సినిమాలకు పూర్తిగా దూరమైంది.
దాంతో వ్యాపార రంగంలో బాగానే రాణిస్తోంది.ఇటీవలే ఈ అమ్మడికి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అవకాశం రావడంతో ఓకే చెప్పింది.
కాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో కలిపి సెలీనా జెట్లీ దాదాపుగా 20కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి.
కాగా ఆ మధ్య సెలీనా జైట్లీ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ కమల్ ముఖర్జీ దర్శకత్వం వహించిన “సీజన్స్ గ్రీటింగ్” అనే షార్ట్ ఫిలింలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఈ లఘు చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయినటువంటి జే5లో విడుదల చేసారు.
కానీ ఈ లఘు చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇటీవలే సెలీనా జైట్లీ ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సోషయో ఫాంటసీ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.