తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “ఆనందం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నహీరో ఆకాశ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట్లో కొంతమేర తన చిత్రాలతో బాగానే ఆకట్టుకున్న హీరో ఆకాష్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత అవగాహన లోపించడంతో తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.
అయితే ఆ మధ్య ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆకాశ్ పాల్గొని తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా తాను మొదటగా ఆనందం అనే హిట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన తర్వాతి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రాణించలేక పోయానని చెప్పుకొచ్చాడు.
అంతేగాక తాను తెలుగులో నిర్మాతగా వ్యవహరించిన కొన్నిచిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయని దాంతో దాదాపుగా తన డబ్బులను తెలుగు సినిమాలపై పెట్టి నష్టపోయానని చెప్పుకొచ్చాడు.
అయితే ఆ తర్వాత కొంతకాలానికి తమిళం, కన్నడలో సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో తనకు గుర్తింపు లేకపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇస్మార్ట్ శంకర్” తాను తీసినటువంటి ఓ చిత్రానికి పోలి ఉంటుందని కానీ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ ముందుగానే విడుదల చేయడంతో తన చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదని వాపోయాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య ఆకాష్ తమిళంలో “చెన్నై 2 బ్యాంకాక్” అనే చిత్రంలో హీరోగా నటించాడు.
అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఈ మధ్యనే ఆకాష్ తమిళంలో ఓ సీరియల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.