తెలుగులో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వర రావు, సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, తదితర సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నిన్నటి తరం “నటి మంజుల” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె అప్పుడప్పుడు కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.
ఈ క్రమంలో తెలుగులో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సీనియర్ “నటుడు విజయ్ కుమార్” ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే విజయ్ కుమార్ కి పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు.
అతడు ఎవరో కాదు తమిళ ప్రముఖ హీరో అరుణ్ విజయ్ కుమార్. ఇతడు తెలుగులో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించినటువంటి “బ్రూస్ లీ” అనే చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు.
అయితే నటి మంజుల కి మరియు విజయ్ కుమార్ కి ముగ్గురు కూతుర్లు జన్మించారు. కాగా వీరు కూడా తెలుగులో హీరోయిన్లుగా ఒకప్పుడు బాగానే రాణించారు.అయితే ఆ హీరోయిన్లు ఎవరో కాదు అనిత విజయ్ కుమార్, శ్రీదేవి, ప్రీతి విజయ్ కుమార్.ఇందులో హీరోయిన్ శ్రీదేవి తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, అనే చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది.
ఈమె నటించినటువంటి నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లి కానీ ప్రసాద్, వీర తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.
ఇక అనిత కుమారి విషయానికి వస్తే తెలుగులో ఈమె నటించినటువంటి “దేవి” అనే చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో గాని అనిత కుమారి తెలుగులో మళ్లీ నటించలేదు.ఇటీవలే అనిత కుమారి తమిళ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ దర్శకుడిని మూడో పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె భర్త రెండో భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే నటి అనిత కుమారిని పెళ్లి చేసుకున్నాడంటూ కోర్టులో కేసు పెట్టింది. దీంతో అనిత కుమారి మూడో పెళ్లి కూడా మూన్నాళ్ళ ముచ్చట అయింది కాగా ప్రస్తుతం అనిత కుమారి తమిళ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటోంది.
అయితే ఇక ప్రీతి విజయ్ కుమార్ విషయానికి వస్తే ఈమె తెలుగులో వైఫ్, ప్రియమైన నీకు, మా అన్నయ్య, రుక్మిణి, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది. కానీ నీ ఎందుకో ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
దీంతో సినిమా పరిశ్రమకు చెందిన హరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.