తెలుగులో ప్రముఖ దర్శకుడు ఇ. శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “శ్రీను వాసంతి లక్ష్మి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి తమిళ బ్యూటీ పద్మ ప్రియ జానకిరామన్” తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.
అయితే పద్మ ప్రియాంక వచ్చీ రావడంతోనే టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కువగా తన మాతృభాషలోనే సినిమా ఛాన్సులు రావడంతో తెలుగు సినిమాలపై దృష్టి సారించ లేకపోయింది. కానీ అడపాదడపా అప్పుడుడప్పుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించింది.
అయితే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి జాస్మిన్ షా అనే వ్యక్తిని ప్రేమించి 2014వ సంవత్సరంలో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత కూడా పద్మ ప్రియ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూనే ఉంది.
అయితే తెలుగులో పద్మ ప్రియ హీరోయిన్ గా నటించిన మృగం, శ్రీను వాసంతి లక్ష్మి, అందరి బంధువయా, పటేల్ సార్, తదితర చిత్రాల్లో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కాగా తెలుగులో చివరిగా 2017 సంవత్సరంలో సీనియర్ హీరో జగపతి బాబు హీరోగా నటించిన పటేల్ ఎస్.ఐ.ఆర్ అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పద్మప్రియ తెలుగులో నటించలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పద్మ ప్రియ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
అలాగే ఇటీవల మలయాళ భాషలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం…
.