తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఇ. శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “శ్రీను వాసంతి లక్ష్మి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి తమిళ బ్యూటీ పద్మ ప్రియ జానకిరామన్” తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

 Telugu Veteran Actress Padmapriya Janakiraman Real Life News, Telugu Veteran Act-TeluguStop.com

అయితే పద్మ ప్రియాంక వచ్చీ రావడంతోనే టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కువగా తన మాతృభాషలోనే సినిమా ఛాన్సులు రావడంతో తెలుగు సినిమాలపై దృష్టి సారించ లేకపోయింది. కానీ అడపాదడపా అప్పుడుడప్పుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించింది.

అయితే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి జాస్మిన్ షా అనే వ్యక్తిని ప్రేమించి 2014వ సంవత్సరంలో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత కూడా పద్మ ప్రియ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూనే ఉంది.

అయితే తెలుగులో పద్మ ప్రియ హీరోయిన్ గా  నటించిన మృగం, శ్రీను వాసంతి లక్ష్మి, అందరి బంధువయా, పటేల్ సార్, తదితర చిత్రాల్లో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కాగా తెలుగులో చివరిగా 2017 సంవత్సరంలో సీనియర్ హీరో జగపతి బాబు హీరోగా నటించిన పటేల్ ఎస్.ఐ.ఆర్ అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పద్మప్రియ తెలుగులో నటించలేదు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పద్మ ప్రియ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

 అలాగే ఇటీవల మలయాళ భాషలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube