టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక రమేష్ బాబు అప్పట్లో బాగానే అలరించినప్పటికి, ప్రస్తుతం పలు అనివార్య కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు.తాజాగా మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన కుటుంబ సభ్యుల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా తన కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పుకొచ్చింది. అంతేగాక మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తనకు బంధువుగానే కాకుండా మంచి స్నేహితురాలని తెలిపింది.
ఒకవేళ నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు భార్య కాకపోయినా తనకు మాత్రం మంచి స్నేహితురాలిగా ఉండేదని అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది.ఇక సుధీర్ బాబు తన సొంత కష్టంపై పైకి వచ్చాడని అంతేగాక తాను మొదట్లో ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అయినప్పటికీ సినిమాపై ఉన్నటువంటి మక్కువతో తన వృత్తిని వదిలిపెట్టి పూర్తిగా నటనపై దృష్టి సారించి తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చింది.
ఇప్పటికి సుధీర్ బాబు చాలా హార్డ్ వర్క్ చేస్తాడని అతడి కష్టపడే తత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని తన అభిప్రాయాన్ని తెలిపింది.ఇక జయదేవ్ గల్లా ఆ మధ్య పార్లమెంటులో ఇచ్చినటువంటి స్పీచ్ కి ప్రజలు ఫిదా అయ్యారని తాను కూడా ఆ స్పీచ్ విన్న వెంటనే జయదేవ్ గల్లా గారికి ఫోన్ చేసి అభినందనలు తెలిపానని కూడా తెలిపింది.
ఇక ఇక తమ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రేమించుకుని దాదాపుగా ఏడు సంవత్సరాల వేచి చూసి తమ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మంజుల ఘట్టమనేని పలు తెలుగు చిత్రాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది.
ఆమధ్య తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించినటువంటి “మనసుకు నచ్చింది” అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది.