తెలుగులో తల్లి, అక్క, చెల్లెలు, కూతురు, తదితర పాత్రలలో నటించి ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి లక్ష్మి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీనియర్ నటి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రల్లోనే కాకుండా లేడి విలన్ పాత్రలలో కూడా నటించి ఆ పాత్రలకు వన్నె తెచ్చింది.
ఇందులో ముఖ్యంగా లక్ష్మీ లాహిరి లాహిరి లాహిరిలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా నటించినటువంటి “నరసింహ” చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రసంశలు అందుకుంది.
వరుస సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో సినీ పరిశ్రమకు చెందిన భాస్కరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి అయినా కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు.
కానీ అప్పటికే నటి లక్ష్మి కి ఒక కూతురు ఉంది. అయితే ఆమె కూడా తెలుగులో మంచి ఫేమస్ నటి అని ఇప్పటికీ చాలామందికి తెలియదు.
ఆమె ఎవరో కాదు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నటి ఐశ్వర్య. ఈమె అప్పట్లో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలోక్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమైంది.దీంతో ప్రస్తుతం నటి ఐశ్వర్య తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో చివరగా నటి ఐశ్వర్య తన తల్లితో కలిసి టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు “నందిని రెడ్డి” దర్శకత్వం వహించిన టువంటి “ఓహ్ బేబీ” అనే చిత్రంలో నటించారు.కాగా నటి ఐశ్వర్య మరియు లక్ష్మి తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కూడా నటించి ,మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.