మంచి చదువులు చదువుకొని తమకి చేదోడుగా నిలుస్తాడని కొడుకుని విదేశాలకు పంపించి చదివించిన తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చినాడు ఆ పుత్రుడు.తాజాగా పెద్ద చదువుల కోసం గుంటూరుకి చెందినటువంటి ఓ యువకుడు జర్మనీ దేశానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన టువంటి మోహన్ రెడ్డి అనే యువకుడు జర్మనీ దేశంలో ఎమ్మెస్ చదువుకుంటున్నాడు.అయితే ఇతడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చదువుపై ధ్యాస పెట్టలేక పోయాడు.
ఈ కారణంగా సెమిస్టర్ లోని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు.దీంతో అప్పుడప్పుడు తనలో తానే మధన పడుతూ క్రుంగిపోయాడు.
ఈ క్రమంలో మన తల్లిదండ్రుల కి ఫోన్ చేసి మాట్లాడుతూ తాను కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని పాస్ అవుతానో లేదో కూడా తనకు నమ్మకం లేదని అన్నాడు.అయితే అతని తల్లిదండ్రులు మాత్రం మరేం పర్వాలేదని ఇక నుంచైనా బుద్ధిగా చదువుకొమ్మని చెప్పేవారు.
కానీ మోహన్ రెడ్డి మళ్ళీ ఫెయిల్ అవడంతో తీవ్ర మానసిక వేదనకు లోనై తాను ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి అతడి తల్లిదండ్రులు బోరున విలపించారు.అలాగే చేతికందివచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకొని తమ జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపాడని వాపోతున్నారు.