రైతుబిడ్డ యాడున్నావ్.. ఆ పైసలెక్కడ.. యువసామ్రాట్ రవి కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో ద్వారా పేరు సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) ఆ షో షూట్ సమయంలో బిగ్ బాస్ షో విజేతగా నిలిస్తే ఆ షో ద్వారా వచ్చిన ఫ్రైజ్ మనీ మొత్తాన్ని రైతుల కోసమే ఖర్చు చేస్తానని పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

యువసామ్రాట్ రవి పల్లవి ప్రశాంత్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

రైతుబిడ్డ యాడున్నావ్.ఆ పైసలెక్కడ అంటూ యువసామ్రాట్ రవి( Yuvasamrat Ravi ) కామెంట్లు చేశారు.

నాకు కూడా బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఉండేదని కానీ బిగ్ బాస్ సీజన్7 తెలుగు చూసిన తర్వాత బిగ్ బాస్ షోకు వెళ్లాలనే ఆసక్తి పోయిందని యువసామ్రాట్ రవి వెల్లడించారు.

బిగ్ బాస్ సీజన్7 లో పెద్ద డ్రామా నడిచిందని ఆయన పేర్కొన్నారు.రైతుబిడ్డ పేరుతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ సింపతీ డ్రామా మామూలుగా లేదని యువసామ్రాట్ రవి వెల్లడించారు.

"""/" / తాను రైతుబిడ్డనని విజేతగా నిలిస్తే ఫ్రైజ్ మనీ మొత్తం రైతులకే ఇస్తానని చెప్పాడని ఆయన తెలిపారు.

డ్రామాలు ఆడి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడని ఆయన పేర్కొన్నారు.

పల్లవి ప్రశాంత్ తనకు వచ్చిన ఫ్రైజ్ మనీతో ఎంజాయ్ చేస్తున్నాడని కారు కూడా కొనుక్కున్నాడని రైతు బిడ్డ కారు కొనుక్కోవచ్చని యువసామ్రాట్ రవి తెలిపారు.

"""/" / అందులో ఏ మాత్రం తప్పు లేదని అయితే రైతుల పేరు చెప్పుకొని కాదని ఆయన అన్నారు.

రైతులకు ఇస్తానని చెప్పిన డబ్బులైనా ఇవ్వాలి కదా అని చెప్పుకొచ్చారు.పల్లవి ప్రశాంత్ కన్నింగ్ డ్రామాలు చూసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాలనే ఆసక్తి చచ్చిపోయిందని యువసామ్రాట్ రవి అన్నారు.

ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ సినిమాకి డైరెక్టర్ విఠలాచార్య అనుకున్నారు.. రాఘవేంద్రరావుకి మతిపోయింది..?