హైదరాబాద్‎లో ఇవాళ వైఎస్ఆర్‎టీపీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‎లోని లోటస్ పాండ్ లో ఇవాళ వైఎస్ఆర్‎టీపీ కార్యవర్గ సమావేశం జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన భేటీ నిర్వహించనున్నారు.

సమావేశం అనంతరం ఎన్నికల కార్యాచరణను షర్మిల ప్రకటించనున్నారని తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న వైఎస్ఆర్‎టీపీ 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.అదేవిధంగా పాలేరుతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

యూదు విద్యార్ధుల అవస్థలు.. భయంతో మతాన్ని దాచిపెడుతున్నారు .. అమెరికాలో వెలుగులోకి సంచలన సర్వే