బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు

దళితబంధులో కమిషన్ తీసుకున్న వారిపై చర్యలు ఏం తీసుకున్నారని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

అవినీతిపరులను బీఆర్ఎస్ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితబంధులో కమిషన్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.