సాయంత్రం ఢిల్లీకి వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు.

వైఎస్ఆర్ టీపీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పెద్దలు సూచించారు.దీంతో వైఎస్ షర్మిల సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

అయితే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని ఈ బుధవారం లేదా గురువారం విలీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా షర్మిల పోటీపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.

అయితే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

ఆ జిమ్ వర్కౌట్ చేస్తూ 48 కిలోలు తగ్గిన బ్రిటిష్ యువతి..!