సాయంత్రం ఢిల్లీకి వైఎస్ షర్మిల
TeluguStop.com
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు.
వైఎస్ఆర్ టీపీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పెద్దలు సూచించారు.దీంతో వైఎస్ షర్మిల సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
అయితే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని ఈ బుధవారం లేదా గురువారం విలీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా షర్మిల పోటీపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.
అయితే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
డార్క్ నెక్ తో డోంట్ వర్రీ.. ఈ రెమెడీతో వారంలో వైట్ గా మార్చుకోండి!