ట్విట్టర్ లో 6 మిలియన్ మార్క్ టచ్ చేసిన తారక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ ది ఒక్కడిదే కాదు.

కాబట్టి ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

సినిమా పరంగా క్రేజ్ మాత్రమే కాకుండా బయట సోషల్ మీడియాలో కూడా తారక్ ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

ఎన్టీఆర్ సోషల్ మీడియాలో రేర్ గా పోస్టులు చేసిన కూడా ఆయనకు భారీ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.

తాజాగా ట్విట్టర్ లో ఎన్టీఆర్ 6 మిలియన్ మార్క్ టచ్ చేసాడు.దీంతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ 60 లక్షల ట్వీటర్స్ ఫ్యామిలీ లోకి చేరడం అందరికి సంతోషం కలిగిస్తుంది.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత తారక్ లైనప్ గురించి ఒకసారి పరిశీలిస్తే.

ఈయన ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.

మొన్న బర్త్ డే జరుపుకున్న నేపథ్యంలో NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.

"""/" / పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈ సినిమా తర్వాత తారక్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా ఎన్టీఆర్ లైనప్ లో ఉన్నాడు.

పొట్టి డ్రెస్ లో కాకరేపుతున్న సమంత… ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా సామ్!