ఎమ్మెల్యే మాస్క్ తో యువకుడి వినూత్న నిరసన…!

నల్లగొండ జిల్లా:మునుగోడు మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫేస్ మాస్కు ధరించి మునుగోడు మండల కేంద్రానికి చెందిన యువకుడు ఆదివారం వినూత్న నిరసన తెలిపాడు.

మునుగోడు మండల కేంద్రాన్ని అభివృద్ధి చెయలేదనే ఆవేదనతో యువకుడి వినూత్న నిరసనకు దిగినట్లు చెప్పాడు.

మునుగోడులో ప్రభుత్వ కళాశాల,100 పడకల హాస్పిటల్,రెవిన్యూ డివిజన్,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,సోలీపురం బ్రిడ్జి నిర్మించకుండా కేవలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రమే మునుగోడు మండలంలో నిర్మించారని అవేదన వ్యక్తం చేశారు.

మండల ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ చేసుకుంటున్నసందర్భంగా ఈ విధంగానైనా మండల సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవాలని ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

చేసిన సినిమా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాను క్యాన్సల్ చేసిన హీరోలు ..!