ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా.. నితిన్ కీలక వ్యాఖ్యలు..?

యంగ్ హీరో నితిన్ తెలుగులో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలైంది.

ఈ రెండు దశాబ్దాల కాలంలో కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్న నితిన్ ఒక దశలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో మళ్లీ క్రేజ్ పెంచుకున్న నితిన్ గతేడాది వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన భీష్మ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

నితిన్ నటించిన చెక్ మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన నితిన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చెక్ సినిమా సక్సెస్ అవుతుందని తనకు నమ్మకం ఉందని.కమర్షియల్ సినిమా చేయాలనే ఆలోచనతో భీష్మ సినిమాను, వైవిధ్యమైన కథతో సినిమా చేయాలనే ఆలోచనతో చెక్ సినిమాను చేస్తున్నామని నితిన్ కీలక విషయాలను వెల్లడించారు.

చెక్ మూవీలో ఒకే ఒక పాట ఉంటుందని.ప్రేక్షకులను చెక్ మూవీ సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని నితిన్ పేర్కొన్నారు.

జయం తరువాత తాను చెక్ మూవీకే ఎక్కువ టేకులు తీసుకున్నానని చెప్పారు.గతంలో కథలను సెలెక్ట్ చేసుకునే విషయంలో తాను తప్పు చేశానని.

ఇకపై స్టోరీ సెలక్షన్ విషయంలో ఆ తప్పు చేయకూడదని అనుకుంటున్నానని నితిన్ వెల్లడించడం గమనార్హం.

"""/"/ చాలామందికి 2020 సంవత్సరం కలిసిరాకపోయినా తనకు మాత్రం భీష్మ లాంటి హిట్ సినిమాను ఇచ్చిందని.

షాలినితో తన వివాహం జరిగిందని అన్నారు.చెక్ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉందని ఛాన్స్ వస్తే పవన్ తో కలిసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తానని తెలిపారు.

చెక్ సినిమాలో నితిన్ కు జోడీగా ప్రియా ప్రకాష్ నటించగా రకుల్ కీలక పాత్రలో నటించారు.

ఓరి దేవుడో.. ఇంత పెద్ద బీరువాను బైక్‌పై ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..