విగ్గు పెట్టుకుని 20 మంది యువతులను మోసం చేసిన ఘనుడు!

రోజురోజుకూ సమాజంలో దారుణాలు జరుగుతున్నాయి.తప్పుల మీద తప్పులు చేస్తూ సమాజంలో దోషులుగా నిలబడుతున్నారు.

రోజు ఏదొక మూలన ఆడ పిల్లలను మోసం చేస్తూనే ఉన్నారు.తాజాగా ఒక వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరి పెళ్లి చేసుకుంటూ నిత్య పెళ్లికొడుకులా మారిపోయాడు.

ఈ విద్యలో ఆ యువకుడు ఆరితేరి పోయాడు.అమ్మాయిలను మోసం చేసే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసారు.

అతడు బట్టతలను కవర్ చేసుకుంటూ విగ్ పెట్టుకుని మరి అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసాడు.

ఇలా అతడు ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అతడి పేరు కార్తీక్ వర్మ.

అతడు సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐ అంటూ మహిళలను నమ్మిస్తూ వస్తున్నాడు.అతడికి బట్టతల ఉండడంతో విగ్గు పెట్టుకుని మరి మోసాలకు పాల్పడుతున్నాడు.

"""/"/ సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రాప్ చేస్తూ విగ్గు పెట్టుకుని ఉన్న అందమైన ఫొటోలను చూపించి వారిని వలలో వేసుకున్నాడు.

తానొక ఎన్ఆర్ఐ అంటూ అమ్మాయిలను తన వలలో వేసుకుంటూ ఇప్పటి వరకు 20 మంది యువతులను మోసం చేసాడు కార్తీక్ వర్మ.

"""/"/ సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వాళ్లతో కొన్ని రోజులు సహజీవనం చేసే వాడు.

ఆ తర్వాత వ్య్వక్తిగత సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతుకుతున్నాడు.

తాజాగా కూకట్ పల్లిలో ఒక అమ్మాయిని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు కార్తీక్ వర్మ.

దీంతో ఆ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగం లోకి దిగిన పోలీసులు మొత్తం కూపీ లాగారు.

అతడి మోసాలు బయటకు రావడంతో అతడిని అరెస్ట్ చేసారు.

హైదరాబాద్ వర్సెస్ బెంగుళూర్ టీమ్ లో గెలిచే టీమ్ ఏదంటే..?