మనసుకు నచ్చిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోలేం: జాన్వీ కపూర్

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అందాల నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి జాన్వీ కపూర్.

ప్రస్తుతం ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ సినిమా మంచి విజయం కావడంతో జాన్వీ కపూర్ తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమె నటుడు వరుణ్ ధావన్ తో కలిసి మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ డేటింగ్ కాన్సెప్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తన తల్లిదండ్రులకు డేటింగ్ కాన్సెప్ట్ అంటే ఏమాత్రం నచ్చదని ఈమె పేర్కొన్నారు.ఈ విషయంపై వారు స్పందిస్తూ తమకు డేటింగ్ అంటే నచ్చదని ఒకవేళ నీ మనసుకు నచ్చిన వాడు దొరికితే తెచ్చి మాకు పరిచయం చేయి పెళ్లి చేస్తామంటూ చెప్పేవారని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

ఇలా మనసుకు నచ్చిన ప్రతి వాడిని వెళ్లి పరిచయం చేసి పెళ్లి చేసుకోలేము కదా అంటూ ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

"""/"/ ప్రస్తుతం తాను సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని, మనం చాలా ప్రశాంతంగా ఉంటాం ఎప్పుడు చిల్ అవుతూ ఉంటాం అందుకే జీవితంలో లైక్ అండ్ చిల్ కాన్సెప్ట్ ఉండాలని, వాళ్లు దీనిని అర్థం చేసుకోలేరు అంటూ జాన్వీ కపూర్ ఈ సందర్భంగా డేటింగ్ కాన్సెప్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే గతంలో ఈమె ఒకరితో రిలేషన్ లో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కానీ ఆ వార్తలు నిజం కాదంటూ తాజాగా ఒక రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె ఆ వార్తలను కొట్టి పారేస్తూ తాను ప్రస్తుతం సింగిల్ గా తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని వెల్లడించారు.

పొట్టకూటి కోసం హోటల్లో పని చేశాడు.. ఇప్పుడు అతడి ఆస్తి 100 కోట్లకు పైమాటే..!!