ప్రజల దృష్టి మరల్చడానికే దశాబ్ది ఉత్సవాల ఆరాటం…!

సూర్యాపేట జిల్లా:దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు చేయడంలో విఫలమైన కేసీఆర్( CM KCR ) ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చి,తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి దశాబ్ది ఉత్సవాల పేరుతో హంగామా చేస్తున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్ల రమాశంకర్( Gatla Ramashankar ) అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితితెలంగాణ జన సమితి( Telangana Jana Samithi) మూడో ప్లీనరీ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దశాబ్ద కాలంలో రంగాల వారీగా సాధించిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం వరకు జరిగిన అవినీతిపై న్యాయ విచారణకు సిద్ధమేనాననిసవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, కిరణ్,లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్,పట్టణ పార్టీ అధ్యక్షులు బందన్ నాయక్,ఎస్సీ,ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూరి గోపి,పార్టీ నాయకులు కృష్ణారెడ్డి,శ్రీనునాయక్,సుమన్ నాయక్, సూర్యనారాయణ, యాకూబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాకు ఏ సమస్య వచ్చినా ఆయననే పిలుస్తా.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!