ఏపీలో వైసీపీకి ఘోర పరాభవం.. 10 స్థానాలకు పడిపోయిన వైనం

ఏపీలో వైసీపీకి( YCP ) ఘోర పరాభవం ఎదురైంది.ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.

ఈ క్రమంలోనే 151 సీట్ల నుంచి 10 స్థానాలకు పడిపోయింది.ఈ ఎన్నికల్లో కేవలం పది స్థానాలకే పరిమితమైన వైసీపీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవలేదు.

వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( YS Jagan, Peddireddy Ramachandra Reddy ) మినహా కేబినెట్ అంతా ఓటమి పాలైంది.

వైసీపీలో హేమాహేమీలుగా కొనసాగిన నేతలంతా మట్టికరిచారు.కాగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయాన్ని సాధించింది.

సుమారు 136 స్థానాల్లో టీడీపీ, 21 స్థానాల్లో జనసేన, ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలుపొందాయి.

ఇడ్లీ, సాంబార్ ట్రై చేసిన రష్యన్ యువతి.. ఆమె రియాక్షన్ ఇదే..?