రాజకీయాలు మానేస్తాను గానీ జీవితంలో పార్టీ మారేదీ లేదు – ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

విజయవాడ: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.నియోజకవర్గంలో పరిస్థితుల వల్ల గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొలేకపోయాను.

అన్ని విషయాలపై సీఎం పూర్తి క్లారిటీ ఇచ్చారు.ఈ వారం నుంచి గడప గడపకూ కార్యక్రమం ప్రారంభిస్తాను.

నేను చురుకుగా లేకపోవడం తో పార్టీ మరతానని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

అవసరమైతే రాజకీయాలు మానేస్తాను గానీ జీవితంలో పార్టీ మారేదీ లేదు.గొల్లపూడి లో దేవినేని ఉమా ఇల్లు ఉన్నప్పటికీ వృద్ధ మహిళ ఇంట్లో ఆఫీస్ ఎందుకు పెట్టారు? లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీ కి తీవ్ర నష్టం జరగనుంది.

సొంత పార్టీ వ్యక్తులు నన్ను ఇబ్బందులకు గురి చేసింది వాస్తవం.ఒక నియోజకవర్గం వారు వేరే చోట వేలు పెడితే చూస్తూ ఊరుకోమని సీఎం చెప్పారు.

ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి చికాకు సృష్టిస్తున్నారని సీఎం కు చెప్పాను.

యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా మారుతుంటే శర్వానంద్ ఇక స్టార్ హీరో అవ్వలేడా..?