కరోనా నుండి కోలుకున్న ఎమ్మెల్యే.. ప్లాస్మా డొనెట్

ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటం లేదు.

అయితే సామాన్య ప్రజల నుండి నాయకుల వరకు అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఏపీలో ఇప్పటికే వెయ్యికి పైగా మృతులు సంఖ్య చేరుకుంది.అంతేకాకుండా ఈ మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంది.

ఈ నేపథ్యంలో ఎక్కువ లక్షణాలు కలిగిన రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ఈ మహమ్మారికి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ మహమ్మారి బారి నుండి కోలుకున్న వైసీపీ ఎమ్మెల్యే ప్లాస్మాను దానం చేశారు.

అయితే కరోనా నుండి కోలుకున్న కొందరు ప్లాస్మా దానం చేసేందుకు చాల భయపడుతున్నారు.

ఇప్పటికే కరోనా బారి నుండి కోలుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ప్లాస్మా దానం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇలా చేయటం ద్వారా చాల వరకు కరోనా మరణాల రేటును తగ్గించవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ కరోనా బారినపడిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ కరోనా బారి నుండి కోలుకుని ప్లాస్మాను దానం చేశారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.కరోనా వచ్చిందని భయపడకూడదని తెలియజేశారు.

కరోనా పట్ల అజాగ్రత్తగా కూడా ఉండకూడదని తెలియజేశారు.అయితే తనకు గత నెల 20న కరోనా వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని ఆయన తెలియజేశారు.

స్టార్ హీరో బాలయ్య ఖాతాలో మరో అరుదైన ఘనత.. ఏ స్టార్ హీరో బ్రేక్ చేయలేరుగా!