చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతు మరణాలు గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!!
TeluguStop.com
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతు సమస్యలు పవన్కి గుర్తొచ్చాయా.? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది రైతులు మరణించారు అప్పుడు ఎందుకు పవన్ ప్రశ్నించలేదు.
పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదనీ తెలిపారు.
తాజాగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని తెలిపారు.ఇక ఇదే సమయంలో జూలై 8 వ తారీఖున పార్టీ ప్లీనరీ సమావేశం పైన చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నారు.
పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని.విపక్షాలకు వ్యక్తులు ప్రజలకు వివరించాలని సీఎం జగన్ సూచించారని.