వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మౌనం వెనక కారణం ఇదేనా.. ?
TeluguStop.com
ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకుంది నటి రోజా.
అయితే ఈ మధ్య కాలంలో ఆమె మాటలే కరువయ్యాయి.ఇంత కాలం వైసీపీ మీద ఈగ వాలనివ్వని ఆమె ఈ మధ్య అస్సలు నోరే విప్పడం లేదని లోకం అనుకుంటుందట.
కాగా ప్రస్తుతం అధికారపార్టీ వైసీపీలో కూడా ఇదే చర్చ నడుస్తుందట.ఇకపోతే రోజా రెండోసారి ఎమ్మెల్యే కాగానే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు.
కానీ ఊహించని రీతిలో మంత్రి వర్గంలో ఆమెకు చోటు దక్కకుండా పోయింది.ఇలా ఎన్నో తర్జభర్జనల మధ్య చివరికి ఏపీఐఐసి చైర్మన్గా పదవి ఇచ్చినా అందులో అసంతృప్తిగానే కొనసాగుతున్నారు.
ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా సొంత పార్టీ నుంచే ఇబ్బందులు.
ఇవి చాలవన్నట్లుగా నగరిలో తన ప్రత్యర్థులకు పదవులు ఇవ్వడంపై రగలిపోతున్నారట రోజా.ఈ కారణంగానే ఆమెలో మునుపటి దూకుడు లేదన్నది కొందరి వాదన.
మరి పార్టీలో ఫైర్బ్రాండ్ గా పేరున్న రోజా ఫైర్ మిస్ చేసుకుని ఇలా ఎన్నాళ్లూ మౌనంగా ఉంటారో చూడాలి అనుకుంటున్నారట ఆమె సన్నిహితులు.
‘నిన్ను నరికి, మీరట్ స్టైల్లో ప్యాక్ చేస్తా’.. భర్తకు భార్య బెదిరింపు.. వీడియో చూస్తే వణికిపోతారు..