వైసీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారుః నారా లోకేష్
TeluguStop.com
వైసీపీ పాలనలో ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
జగన్ కు భయపడి రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు.టీడీపీ ఐదేళ్ల పాలనలో 39 వేల 450 పరిశ్రమలు వచ్చాయన్నారు.
కానీ ప్రస్తుతం వైసీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు.
అదేవిధంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతున్న వైసీపీ నేతలు.
ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
MLC Kavitha Anil : తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో అనిల్ ములాఖత్..!