పార్టీ ప్రక్షాళనపై స్పీడ్ పెంచిన వైసీపీ..!!

ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ ప్రక్షాళనపై స్పీడ్ పెంచింది.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే.తాజాగా ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తో సాయంత్రం ఎమ్మెల్యేలు కీలక భేటీ నిర్వహించనున్నారు.

అలాగే రేపు మరికొందరిని పిలిచి మార్పుపై సీఎం జగన్ నిర్ణయం చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జగ్గంపటే ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు పిలుపు రాగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కూడా సీఎం జగన్ ను కలవనున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే పోలవరం, పి.గన్నవరంతో పాటు చింతలపూడి ఎమ్మెల్యేలకు సైతం పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బైక్ రైడర్లపై దాడి చేసిన ఎద్దు.. వీడియో చూస్తే గుండె గుబేల్..?