నా రెండు చెప్పులు వైసీపీ ప్రభుత్వం దొంగిలించింది పవన్ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర పిఠాపురంలో ( Pithapuram ) శుక్రవారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ముఖ్యమంత్రికి జనసేన పార్టీ అంటే భయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.వైసీపీ నేర చరిత్ర కలిగిన ప్రభుత్వమని సంచలన ఆరోపణలు చేశారు.
మరోసారి వారికి అధికారం కట్టబెడితే ఎవరిని బతకనివ్వరని వ్యాఖ్యానించారు.ఎప్పుడూ తెల్ల బట్టలతో వచ్చే నేను ఈ రకంగా వేరే బట్టలు వేసుకోవడానికి గల కారణం.
మీకు సందేహం రాలేదా అని పవన్ స్పీచ్ మధ్యలో సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.
"""/" /
ఇదే సమయంలో దానికి సమాధానం ఆయనే చెబుతూ.మొన్న అన్నవరం దేవాలయంలో రెండు చెప్పులు కొట్టేశారు.
దాంతో చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగోదు కదా.ప్యాంటు, షర్టు, షూ వేసుకుని రావటం జరిగింది.
నాకు ఇష్టమైన నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు.మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్.
ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియటం లేదు.మీకేమైనా పట్టుకోండి.
నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్.వైసీపీ ప్రభుత్వం.
ఎంత దిగజారిపోయింది అంటే.గుడిలో.
వదిలిన నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుంది.అంటూ పవన్ సెటైర్లు వేశారు.
ఇంగ్లాండ్: ఇది మంత్రగత్తెల జైలు అట.. ఇందులోకి వెళ్లిన మహిళకు షాకింగ్ ఎక్స్పీరియన్స్..?