ఆ సీరియల్ వల్ల అన్ని కేజీలు తగ్గానన్న యశ్మీ గౌడ.. బాధ తట్టుకోలేమంటూ?

ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న కృష్ణా ముకుంద మురారి( Krishna Mukunda Murari ) సీరియల్ ద్వారా యశ్మీ గౌడ పాపులర్ అయ్యారనే సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్య్వూలో యశ్మీ గౌడ( Yashmi Gowda ) మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నాగ భైరవి సీరియల్ చాలా బాగా ఫేమస్ అయిందని యశ్మీ గౌడ అన్నారు.

నాగ భైరవి సీరియల్ అంటే అది పూర్తిగా ఫాంటసీ స్టోరీ అని యశ్మీ గౌడ కామెంట్లు చేయడం గమనార్హం.

"""/"/ ప్రతిరోజు మాకు టాస్క్ లా ఉండేదని ఏదో ఒక అడ్వెంచర్ సీరియల్ షూట్ లో పెట్టేవారని యశ్మీ గౌడ వెల్లడించారు.

నేను అసలు జిమ్ కే వెళ్లేదానిని కాదని అయినప్పటికీ నేను ఏకంగా 9 కేజీలు తగ్గానని ఆమె కామెంట్లు చేశారు.

ఆ సీరియల్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశామని యశ్మీ గౌడ వెల్లడించారు.

ఆ సీరియల్ లో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తిగా ఉండేదని మాకు కూడా యాక్టింగ్ చేయడానికి ఆసక్తిగా అనిపించేదని యశ్మీ గౌడ చెప్పుకొచ్చారు.

"""/"/ నాగభైరవి( Naga Bhairavi Serial ), కృష్ణాముకుందమురారి పూర్తిగా డిఫరెంట్ అని ఆమె అన్నారు.

ముకుంద పాత్ర( Mukunda లో ఎవరు ఉన్నా అదే విధంగా బిహేవ్ చేస్తారని ఆ పాత్ర స్వభావం బాధను చూపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

నిజ జీవితంలో కూడా మోసం చేస్తే ఆ బాధను తట్టుకోలేమని యశ్మీ గౌడ చెప్పుకొచ్చారు.

యశ్మీ గౌడ కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు ఎక్కువ సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

విభిన్నమైన పాత్రలకు మాత్రమే ఓటేస్తానని యశ్మీ గౌడ అన్నారు.ఆర్య2 సినిమాను నేను చాలాసార్లు చూశానని ఆమె చెప్పుకొచ్చారు.

యశ్మీ గౌడ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.యశ్మీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?