కేజీఎఫ్‌ తర్వాత తెలుగు, కన్నడంలో యశ్‌ పాన్‌ ఇండియా మూవీ

సౌత్‌ స్టార్‌ హీరోలు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు.అన్ని భాషల హీరోలు కూడా ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీలో తమ సినిమాలు ఆడాలని ఆశిస్తున్నారు.

అందుకోసం పాన్‌ ఇండియా దర్శకులను ఎంపిక చేసుకోవడం లేదంటే యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ లను ఎంపిక చేయడం చేస్తున్నారు.

ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న ప్రతి ఒక్క సినిమాపై బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

అలా యశ్‌ సినిమాపై కూడా బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.కేజీఎఫ్‌ ‌ తో ఓవర్‌నైట్‌ ఆల్‌ ఇండియా స్టార్‌ అయిన యశ్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.ఈ ఏడాది చివరి వరకు కేజీఎఫ్‌ 2 పూర్తి అవ్వబోతుంది.

ఆ తర్వాత యశ్‌ చేయబోతున్న సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలుగు మరియు కన్నడంలో ఈయన తదుపరి సినిమా ఉంటుందని అంటున్నారు.తెలుగు ప్రేక్షకుల్లో యశ్‌ కు మంచి క్రేజ్‌ ఉంది.

అందుకే ఆయనతో ఒక ప్రముఖ దర్శకుడు తెలుగు మరియు కన్నడంలో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడట.

ఆ సినిమాను తమిళం మలయాళం మరియు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేయబోతున్నారు.

యశ్‌ తదుపరి సినిమా దాదాపుగా 150 కోట్ల బడ్జెట్‌ తో ఉంటుందని సమాచారం అందుతోంది.

అతి త్వరలోనే ఈ సినిమా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

రాజమౌళి వల్ల కానిది ప్రశాంత్ నీల్ చేసి చూపిస్తాడా..?