రేపు హైదరాబాద్‎లో చంద్రబాబును కలవనున్న యార్లగడ్డ..!

టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం నియోజకవర్గ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు కలవనున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లో రేపు సమావేశం కానున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో చంద్రబాబును యార్లగడ్డ వెంకట్రావు అపాయింట్ మెంట్ అడిగారని తెలుస్తోంది.

గన్నవరం టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తానని తెలిపారు.

ఈ క్రమంలో తనను చంద్రబాబు నమ్మాలన్న యార్లగడ్డ ఏ పార్టీ అయినా నమ్మిన వారిని కాపాడుకోవాలని వెల్లడించారు.

వైసీపీ శ్రేణులకు క్షమాపణ చెప్తున్నానన్నారు.గత మూడున్నరేళ్లుగా తనకు వైసీపీ ప్రత్యామ్నాయం చూపలేదని తెలిపారు.

అలా పిలవొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేసిన నయనతార.. ఫ్యాన్స్ పాటించడం సాధ్యమేనా?