సీఎం జగన్ పై యనమల విమర్శనాస్త్రాలు
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత యనమల స్పందించారు.ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిందని జగన్ చెప్పడం మోసం చేయడమేనని విమర్శించారు.
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గితే వృద్ధిరేటు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.
జగన్ నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పారు.ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న ఆయన క్రాప్ హాలిడేస్ ప్రకటించే పరిస్థితి వచ్చిందంటూ ధ్వజమెత్తారు.
‘జనసేన ‘కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ?