మంత్రి బుగ్గన వ్యాఖ్యలకు యనమల కౌంటర్

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలకు టీడీపీ నేత, మాజీమంత్రి యనమల కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో బుగ్గనకు తెలుసా అని అడిగారు.

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎందేనని తెలిపారు.బహిరంగ మార్కెట్ ద్వారా తెచ్చిన అప్పెంత.

? కట్టిన వడ్డీ ఎంత.? అని ప్రశ్నించారు.

పీడీ అకౌంట్ లో నిధులెంత వాడారు.? పెండింగ్ బిల్స్ ఎన్నో చెప్పాలన్నారు.

ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు.కేంద్రం ఎన్ని కోట్లు నిధులిచ్చిందన్న ఆయన ఎన్ని కోట్లు దారి మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ లాంటి షోలు మనకు సెట్ అవ్వువు… క్లారిటీ ఇచ్చిన ఇంద్రనీల్!