ఈ నెల 7, 8 న ప్రపంచ వరి సదస్సు.. మంత్రి తుమ్మల

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala Nageswar Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 7 మరియు 8వ తేదీన తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సు( World Rice Conference ) జరుగుతుందని తెలిపారు.

దాదాపు 150 మంది విదేశీ వరి ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతారని మంత్రి తుమ్మల వెల్లడించారు.

అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మరో 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీల ప్రతినిధులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలు( Agriculture Scientists ) హాజరు అవుతారని పేర్కొన్నారు.

తెలంగాణలోని దాదాపు 30 మంది అభ్యుదయ రైతులు, 30 మంది రైస్ మిల్లర్లు కూడా సదస్సులో పాల్గొంటారని తెలిపారు.

ఇండియాలో ఆ డ్రింక్ తాగి ఆసుపత్రి పాలైన యూకే వ్యక్తి..?