కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య( Dommati Narasiah ) మాట్లాడుతూ మహిళలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆరు స్కీములలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు 25 వందల పెన్షన్ తో పాటు 500 కే సిలిండర్ 200 యూనిట్ల విద్యుత్ మాఫీ ఉచిత బస్సు ప్రయాణంఈ పథకాలను మహిళల కోసమే కేటాయించడం జరిగిందన్నారు.

వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు లింగం గౌడ్, మర్రి శ్రీనివాసరెడ్డి, గిరిధర్ రెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, సూడిద రాజేందర్ ,గంట బుచ్చగౌడ్,చెన్ని బాబు పాల్గొన్నారు.

వీడియో: గుండెపోటుతో మరొకరు మృతి.. కార్డియో చేస్తూ కుప్పకూలాడు..