మహిళలు మౌనం వీడండి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి

2024 సంవత్సరంలో గడిచిన ఆరు నెలల వ్యవధిలో జిల్లాలో మహిళలను( Women ) వేధిస్తున్న వారిపై 24 కేసులు,మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తున్న వారిపై 18 పెట్టి కేసులు నమోదు చేసి జిల్లాలో ఉన్న మహిళల,విద్యార్థినిల పట్ల జిల్లా షీ టీమ్ అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ మంగళవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఉన్న షీ టీమ్స్ బృందాలు కళాశాలలో, పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో,మహిళలు పని చేస్తున్న ప్రదేశాల్లో,బస్టాండ్ ప్రాంతల్లో మహిళలకు, విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై 360 అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ( District Police Department ) పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.

మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు.

మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ తెలిపారు.

సమంతను వదలని ఆ ఇద్దరు డైరక్టర్లు…మరో ఛాన్స్ కొట్టేసిన నటి!