గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి అంబటికి నిరసన సెగ తగిలింది.
పల్నాడు జిల్లా రాజుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అంబటిని కొందరు మహిళలు, గ్రామస్తులు నిలదీశారు.
దీంతో మంత్రి సైతం ఎదురు ప్రశ్నలు సంధిస్తూ ముందుకు సాగిపోయినట్లు తెలుస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ మంత్రి అంబటిని మహిళలు నిలదీశారు.