ఇదేందయ్యా ఇది : మద్యం మత్తులో రెచ్చిపోయిన మందు భామ …

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేస్తూ మద్యం అమ్మకాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఒక్కసారిగా మందుబాబులు మద్యం కోసం మద్యం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు.

అయితే ఎప్పుడూ లేని విధంగా మహిళలు కూడా మద్యం కోసం మద్యం దుకాణాల ముందు వేచి ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అయితే తాజాగా ఓ యువతి పీకల దాకా మద్యం సేవించి రోడ్డు పై నానా రచ్చ చేసినటువంటి ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని అనాపూర్ జిల్లా పరిసర ప్రాంతంలో ఓ యువతి గత కొద్దికాలంగా నివాసం ఉంటోంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను చేపట్టడంతో యువతి ఫుల్లుగా మద్యం సేవించి స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో నానా రచ్చ చేసింది.

అంతేకాక బంక్ లో ఉన్నటువంటి పలు వస్తువులను పగలగొడుతూ సిబ్బందిపై దాడి చేయ సాగింది.

దీంతో యువతిని అదుపు చేయలేక పోయినటువంటి సిబ్బంది వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచార అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు లేడీ కానిస్టేబుల్ సహాయంతో యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి స్థానికులు మహిళ సృష్టించిన వీరంగాన్ని తమ చరవాణుల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

మరికొందరైతే "ఎవరయ్యా. భారతదేశంలో మహిళలకు స్వతంత్రం లేదని చెప్పిందని" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో: ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..