ఇంటి నుంచి పారిపోయిన యువతి పాపం చివరకు ఇళ్లు చేరిందిలా.. ?

ఆడపిల్లలకు రక్షణ కరువైన ఈ రోజుల్లో వారు ఇంటి నుండి బయటకు వెళ్లితే వచ్చే వరకు కన్న తల్లిదండ్రులకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయ.

ఎక్కడ చూడూ ఆడది కనిపిస్తే ఆశగా చూసే తోడేళ్లు ఉన్న ఈ సమాజంలో వారి బారినుండి ఆడపిల్లలను కాపాడటం ప్రస్తుత కాలంలో ఓ యజ్ఞంలా మారిపోయింది.

ఇకపోతే వారం రోజుల క్రితం అలిగి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి చివరకు అనుమానాస్పదంగా మృతి చెంది శవమై ఇళ్లు చేరిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిందట.

ఆ యువతి కోసం రెండు రోజులు వెతికినా ఆచూకీ లేక పోవడంతో ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్​లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారట.

కాగా నిన్న సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారట.ఇక ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారట.

ధనుష్ కొత్త టార్గెట్ ఏంటి అంటే..?