టెల్ అవీవ్ దాడి: బిడ్డను రక్షించేందుకు ఇజ్రాయెల్ మహిళ ప్రాణాలు త్యాగం..

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్( Tel Aviv ) నగరం దగ్గర జాఫా అనే ప్రాంతంలో దారుణమైన అటాక్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో ఇద్దరు దుండగులు తుపాకి, కత్తితో ప్రజలపై వారు దాడి చేసిన వారిని ముహమ్మద్ మెసెక్, అహ్మద్ హిమౌని అని పేర్కొన్నారు.

పోలీసులు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెంటనే స్పందించి దుండగులను కాల్చివేశారు.దాడిలో ముహమ్మద్ మెసెక్ అక్కడికక్కడే చనిపోయాడు.

అహ్మద్ హిమౌనికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. """/" / ఇజ్రాయెల్‌లో జరిగిన దాడిలో తన 9 నెలల మగబిడ్డను కాపాడడం కోసం తల్లి (33) తన ప్రాణాలు త్యాగం చేసింది.

ఆమె పేరు సెగెవ్-విగ్డర్.2023లోనే వివాహం చేసుకున్న ఈ ఈమెకు ఇది మొదటి సంతానం.

ఆమె భర్త యేరి, "నేను గజాలో విధులు నిర్వహిస్తున్నా.కానీ, ఆమె ప్రసవించే సమయానికి ఆమెతో ఉండడానికి వచ్చాను.

ఆమె నా అత్యంత ప్రియమైన వ్యక్తి, అద్భుతమైన తల్లి.ఆమె జీవితం చాలా బ్యూటిఫుల్ గా ఉండేది.

కానీ ఆ దుర్మార్గులు ఆమెను చంపేశారు." అని విచారంగా వ్యక్తం చేశారు.

"""/" / ఇజ్రాయెల్‌( Israel )ప్రభుత్వం తన అఫీషియల్ ఎక్స్ పేజీలో సెగెవ్-విగ్డర్ చిత్రాన్ని పంచుకుంటూ, "ఆమె తన బిడ్డలు ప్రాణాన్ని కాపాడింది.

మాటలు రావట్లేదు, కేవలం విషాదమే.బాధితులదాడి చేశారు.

ఈ దాడిలో ఒక ఇజ్రాయెలీ మహిళతో సహా ఆరుగురు ప్రజలు చనిపోయారు.ఇంకొక 16 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.

ఈ దాడికి హమాస్ సంస్థ బాధ్యత వహించింది.ఆత్మకు శాంతి చేకూరాలి" అని పేర్కొంది.

కొంతమంది ఈ యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కాబట్టి యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు.

ఒక తల్లి తన బిడ్డను కాపాడటానికి ప్రాణాలు త్యాగం చేయడం చాలా గొప్ప విషయమని, తల్లి ప్రేమే అత్యంత అందమైనది అని కొంతమంది అంటున్నారు.

ఆమె కొడుకు పెద్దయ్యాక తన తల్లి ఎందుకు ప్రాణాలు కోల్పోయిందో అర్థం చేసుకుంటాడని ఆశిస్తున్నారు.

ఈ యుద్ధం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, ప్రజల అహంకారం మరియు మొండితనం వల్లే ఈ యుద్ధం జరుగుతోందని కొంతమంది అంటున్నారు.

రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి..