వామ్మో ఇదేం ఖర్మ.. జపాన్లో హోటల్ రూమ్ కెళ్లి బెడ్ చూసి షాక్.. దుప్పట్లో ఎవరో..!
TeluguStop.com
ఒంటరిగా ప్రయాణం చేయడం మహిళలకు ఎంతో స్వేచ్ఛనిస్తుంది.అందుకే చాలామంది సేఫ్ అనుకున్న దేశాలను వెతుక్కుంటారు.
జపాన్( Japan ) అంటే మనందరికీ సేఫెస్ట్ దేశంగానే తెలుసు.కానీ ఒక థాయ్లాండ్ నుంచి జపాన్కు సోలో ట్రిప్ వెళ్లిన ఓ అమ్మాయికి అక్కడ ఎదురైన అనుభవం చూస్తే నిజంగా వామ్మో అనాల్సిందే.
థాయ్లాండ్కు( Thailand ) చెందిన నటాలిసి టాక్సిసి ( Natalisi Taksisi ) జపాన్కు డ్రీమ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంది.
ఒంటరిగా ఆ దేశాన్ని చుట్టేద్దామని ఓ హోటల్లో రూమ్( Hotel Room ) బుక్ చేసుకుంది.
జపాన్ అంటేనే సేఫ్టీకి మారుపేరు కదా, పైగా తాను బుక్ చేసుకున్న హోటల్లో కీ-కార్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకా సేఫ్ అనుకుంది.
రోజంతా బయట తిరిగి రూమ్కు వచ్చి కాస్త రెస్ట్ తీసుకుందామని బెడ్పై పడుకుంది.
అంతే.బెడ్ కింద నుంచి ఏదో తెలియని, విచిత్రమైన వాసన వస్తున్నట్లు ఆమెకి అనిపించింది.
ఏదో తేడాగా ఉందని అనిపించి కాస్త అసౌకర్యంగా ఫీలైన నటాలిసి ధైర్యం చేసి బెడ్ కింద తొంగి చూసింది.
అక్కడ ఓ వ్యక్తి దాక్కుని ఉన్నాడు.అతని కళ్లు తననే చూస్తున్నట్లు స్పష్టంగా కనిపించాయి.
అది చూసి నటాలిసి భయంతో వణికిపోతూ గట్టిగా కేకలు వేసింది.వెంటనే ఆ వ్యక్తి బెడ్ కింద నుంచి బయటకు వచ్చి రూమ్ నుంచి పారిపోయాడు.
"""/" /
వెంటనే నటాలిసి పరుగు పరుగున హోటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్లి సిబ్బందికి విషయం చెప్పింది.
వారు పోలీసులకు సమాచారం అందించారు.అయితే, హోటల్లో సీసీటీవీ కెమెరాలు ఏవీ పనిచేయడం లేదని తెలిసి ఆమె మరోసారి షాకైంది.
తర్వాత పోలీసులు వచ్చి రూమ్ లో వెతకగా ఆ వ్యక్తి మర్చిపోయిన ఒక పవర్ బ్యాంక్, USB కేబుల్ దొరికాయి.
ఈ మొత్తం ఘటనతో తాను అనుభవించిన మానసిక వేదన, భయంకరమైన అనుభవం దృష్ట్యా రూమ్ డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వమని నటాలిసి హోటల్ వారిని కోరింది.
కానీ హోటల్ యాజమాన్యం పూర్తి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది.దీంతో ఆమె ఆ రాత్రి అక్కడి నుంచి వేరే హోటల్కు మారిపోయింది.
పోలీసు రిపోర్ట్ కాపీని మెయిల్ ద్వారా పంపిస్తామని పోలీసులు చెప్పినా, మరుసటి రోజు వరకు అది రాలేదు.
"""/" /
తనకు ఎదురైన ఈ భయంకరమైన సంఘటనను నటాలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ద్వారా అందరితో పంచుకుంది.
"జపాన్లో హోటల్ రూమ్ లో నా బెడ్ కింద ఒక మనిషిని చూసాను.
నేను దీన్ని సురక్షితమైన సోలో ట్రిప్గా భావించాను" అని క్యాప్షన్ రాసింది.తను స్టే చేసిన APA హోటల్ కోసం 510 డాలర్లు (సుమారు రూ.
42 వేలు) ఖర్చు పెట్టినట్లు ఆ వీడియోలో చెప్పింది.నటాలిసి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇప్పటివరకు దాదాపు 20 లక్షల వ్యూస్ వచ్చాయి.చాలామంది సోషల్ మీడియా యూజర్లు నటాలిసికి సపోర్ట్ చేస్తూ, ఆ హోటల్ను బుకింగ్ సైట్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఒంటరిగా ప్రయాణించే మహిళలు హోటల్స్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మిగతావారిని హెచ్చరించారు.