ఇదెక్కడి దారుణం మావా : భర్తని చంపితే 3 కోట్లు ఇన్సూరెన్స్ వస్తుందని భార్య ఏకంగా...

ఈ మధ్య కాలంలో డబ్బు, ఆస్తుల మోజులో పడి కొందరు కట్టుకున్న వారిని సైతం కడతేర్చటానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

కాగా తాజాగా ఓ వివాహిత తన భర్త పేరు మీదుగా మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉందని తెలుసుకుని దాంతో తన భర్తని హతమారిస్తే ఆ మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందనే ఆశతో దారుణంగా తన భర్తని సజీవ దహనం చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే 55 సంవత్సరాలు కలిగినటువంటి "రంగరాజన్" అనే వ్యక్తి స్థానిక రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం ఇప్పటివరకు పలు వ్యాపారాలు చేసి కొంతమేర నష్టాలను చవి చూశాడు.

ఈ క్రమంలో దాదాపుగా కోటి రూపాయలకు పైగా అప్పులు చేశాడు.అయితే ఇటీవలే రంగరాజన్ తన పేరు మీదుగా దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాడు.

దీంతో ఈ విషయం తన బంధువుల ద్వారా తన భార్య తెలుసుకుంది.దీనికితోడు అప్పుడప్పుడు కొందరు డబ్బు అప్పు ఇచ్చిన వారు తమ డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మరియు తన ముందే తన భర్తను అవమానకరంగా మాట్లాడటంతో రంగరాజన్ భార్య తనలో తానే మదనపడుతూ ఉండేది.

"""/"/ ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా తన భర్తని హతమారిస్తే మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని బంధువుల ద్వారా తెలుసుకుంది.

ఇంకేముంది అనుకున్నదే తడవుగా తన దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో కలిసి తన భర్తని ప్లాన్ చేసి కారులో సజీవ దహనం చేసింది.

దీంతో ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడానికి మరియు తనకు సహాయం చేసినందుకుగాను ఇన్సూరెన్స్ డబ్బులో కొంత వాటాను కూడా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు రంగరాజన్ భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు బయట పడ్డాయి.

దీంతో ఇన్సూరెన్స్ డబ్బు కోసం చీటింగ్ చేసినందుకు మరియు తన భర్తను హత్య చేసినందుకు రంగరాజన్ భార్యకు జైలు శిక్ష పడింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!