కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ను పరామర్శించినట్లు చేసినట్లు తెలిపారు.

కేసీఆర్ కు సర్జరీ జరిగింది, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు.ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే త్వరలోనే కేసీఆర్ కోలుకోవాలన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలన్నారు.

తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలని తెలిపారు.

మండిపోతోన్న అమెరికా.. మరీ ఈ రేంజులో ఉష్ణోగ్రతలా..?