శర్వానంద్ ఈసారైనా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరోలలో హీరో శర్వానంద్ కూడా ఒకరు.

కేవలం ఒకే తరహా చిత్రాలకే పరిమితం కాకుండా యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలలో కూడా నటిస్తూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంటున్నాడు శర్వానంద్.

శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం లాంటి సినిమాలు ఊహించని విధంగా పరాజయం పాలయ్యాయి.

ఇక తాజాగా శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బోతున్నాడు శర్వానంద్.

"""/"/ ఈ సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక మందన హీరోయిన్ నటించింది.ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

ఇందులో సీనియర్ నటీమణులు అయిన రాధిక, ఊర్వశి, ఖుష్బూ అలాంటి అలనాటి అగ్ర నాయకులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇకపోతే ఈ సినిమా మార్చి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఇకపోతే హీరో శర్వానంద్ గతంలో నటించిన సినిమాలు ఏవి ఊహించని విధంగా విజయం సాధించకపోవడంతో, ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లు, పోస్టర్లు విడుదలయ్యాయి.శర్వానంద్ నటించిన నువ్వా నేనా, జెకె ఎన్నుమ్ న‌న్బనిన్ వాళకై, శ్రీకారం లాంటి సినిమాలు వేర్వేరు సంవత్సరాలలో మార్చి నెలలో విడుదలైన విషయం తెలిసిందే.

కానీ ఈ మూడు సినిమాలు అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయాయి.మరి ఈ నేపథ్యంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో అయినా మార్చి అన్న నెగిటివ్ సెంటిమెంట్ ని హీరో శర్వానంద్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.

ఈ సినిమాతో అయినా హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు లేదో చూడాలి మరి.

ఐదు వరుసగా అపజయాల తర్వాత వస్తున్నా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడా లేదా చూడాలి మరి.

అమెరికా : జాహ్నవి కందుల మరణంపై హేళన .. ఆ పోలీస్ అధికారిని తొలగించిన ప్రభుత్వం