‘బ్రో’ మూవీ క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ ఆత్మహత్య చేసుకుంటాడా..? గుండెల్ని పిండేసే రేంజ్ సెంటిమెంట్ !

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'వాల్తేరు వీరయ్య'( Waltheru Veeraya ) మరియు 'వీర సింహా రెడ్డి' చిత్రాల తర్వాత మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం చిన్న సినిమాలు , మీడియం రేంజ్ హీరోల సినిమాలు తెచ్చే వసూళ్లతో నెట్టుకొస్తోంది.

ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఇన్నేళ్ళలో ఎప్పుడూ కూడా కలుగలేదు.భారీ బడ్జెట్ తో, భారీ కాంబినేషన్స్ యథా విడుదలైన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇక రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

దీంతో ఇప్పుడు అందరూ ద్రుష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లేటెస్ట్ చిత్రం 'బ్రో ది అవతార్'( Brow The Avatar ) మీద పడింది.

ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

టీజర్ కి అభిమానులు చొక్కాలు చింపేసుకున్నారు, ఇక మొన్న విడుదలైన 'మై డియర్ మార్కండేయ' ( My Dear Markandeya )సాంగ్ కి మొదట్లో కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చినా ఆ తర్వాత నుండి మాత్రం చిన్నగా పికప్ అయ్యి మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.

ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు విడుదలైన పవన్ కళ్యాణ్ లుక్స్ కి ఎంతో స్టైలిష్ గా , ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ లో ఉన్నాయి.

నిన్న విడుదల చేసిన ఆ సాంగ్ మేకింగ్ వీడియో లో కూడా పవన్ కళ్యాణ్ ఎంతో హుషారుగా ఉన్నాడు.

ఈ చిత్రం లో ఆయన మొదట్లో 45 నిమిషాలు కనిపిస్తాడంటూ వార్తలు వినిపించాయి కానీ, రీసెంట్ గా రెడీ అయిన ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఈ చిత్రం లో ఆయన 95 నిమిషాల పాటు కనిపిస్తాడని తెలుస్తుంది.

"""/" / ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

అదేమిటంటే ఈ సినిమాలోని చివరి 30 నిమిషాలు ఆడియన్స్ ని చాలా ఎమోషనల్ కి గురి చేస్తుందని అంటున్నారు.

క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) సూసైడ్ చేసుకొని చనిపోతాడని అంటున్నారు, ఈ క్లైమాక్స్ మొత్తం చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఏడ్చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా మొత్తం అలా ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టి పారేసేలా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

కోలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్..శబాష్ ..మీరు దమ్మున్న వారు